ePaper
More
    Homeక్రైంKerala | ట్రాలీ బ్యాగుల్లో గంజాయి తరలింపు.. ఇద్దరు మహిళల అరెస్ట్​

    Kerala | ట్రాలీ బ్యాగుల్లో గంజాయి తరలింపు.. ఇద్దరు మహిళల అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala | దేశవ్యాప్తంగా గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాలే కేంద్రంగా పలువురు గంజాయి, డ్రగ్స్​ సరఫరా చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. యువతను మత్తుకు బానిసలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అయితే గంజాయి, డ్రగ్స్​ రవాణా కోసం వీరు పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో దందా నడుపుతున్నారు.

    ట్రాలీ బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్​ చేశారు. పశ్చిమ బెంగాల్‌ (West Bengal)కు చెందిన అనితా ఖాతున్ బీబీ, సోనియా సుల్తానాను కేరళ (Kerala)లోని ఎర్నాకుళం స్టేషన్‌లో రైల్వే పోలీసులు (Railway Police) అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 37 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన వీరు పలు ప్రధాన నగరాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...