అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లి గ్రామంలో (Bommandevpalli village) పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. ఎస్సై రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ.13,370 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ఏ గ్రామంలోనైనా పేకాడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.