ePaper
More
    HomeజాతీయంRahul Gandhi | ఎన్నికల సంఘంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని...

    Rahul Gandhi | ఎన్నికల సంఘంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Rahul Gandhi | కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దేశంలో ఎన్నికలు ప్రస్తుతం నృత్యరూపకం (కొరియోగ్రఫీ) చేయబడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వస్తున్న ఎన్నికల ఫలితాలు అంచనాలను మించి ఉంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్​లోనూ.. ఇదే విధంగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. న్యూ ఢిల్లీలోని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని లెక్కలు చూపుతూ ఈసీపై ఆరోపణలు గుప్పించారు.

    Rahul Gandhi | ఈవీఎంల నిర్వహణపై అనుమానాలు..

    నేటి కాలంలో ఎన్నికలు (Elections) నృత్యరూపకం చేయబడుతున్నాయని, మహారాష్ట్ర ఎన్నికలు దొంగిలించబడ్డాయని రాహుల్ విమర్శించారు. ఈవీఎం(EVM)లతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని, ఎగ్జిట్ పోల్స్ (Exit polls), ఒపీనియన్ పోల్స్​కు (Opinion polls) వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. “ఈ అభిప్రాయ సేకరణల నుంచి అకస్మాత్తుగా ఫలితాల మార్పునకు, ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడానికి ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుంది. కారణాలు అనేకంగా ఉంటాయి- లాడ్లీ బెహ్నా, పుల్వామా, ఇప్పుడు సిందూర్ (ఆపరేషన్ సిందూర్),” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేయగా, తమ అనుమానాలు నిజమయ్యాయని తెలిపారు.

    READ ALSO  Supreme Court | నిజమైన భారతీయులు అలా మాట్లాడరు.. రాహుల్​ గాంధీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు

    Rahul Gandhi | నెలల తరబడి ఎన్నికలు..

    గతంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగేవని, కానీ ఇప్పుడు నెలల తరబడి నిర్వహిస్తున్నారని రాహుల్‌ ఆక్షేపించారు. “దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లేని కాలం ఉండేది; అది వ్యక్తిగత ఓటింగ్. దేశం మొత్తం ఒకే రోజున ఓటు వేసేది. కానీ ప్రస్తుతం యూపీలో వేర్వేరు రోజుల్లో ఓటింగ్ పెడుతున్నారు. కొన్నిసార్లు బీహార్​లో కూడా. కొన్నిసార్లు నెలల తరబడి పోలింగ్​కు సమయం తీసుకున్నారు. దీనిపై మాకు మొదటి నుంచి అనుమానాలున్నాయి. ఎందుకు ఇంత సమయం పడుతోందని?” అని రాహుల్​ గాంధీ (Rahul Gandhi) అన్నారు.

    Rahul Gandhi | ఐదు నెలల్లో కోటి మంది ఓటర్లు..

    ఓటరు చోరీ గురించి రాహుల్ మరోసారి ఆరోపణలు చేశారు. “మహారాష్ట్రలో (Maharashtra) 5 సంవత్సరాలలో కంటే 5 నెలల్లోనే ఎక్కువ మంది ఓటర్లు చేరడం మాకు అనుమానాలను రేకెత్తించింది. అలాగే, సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్ల ఓటింగ్లో భారీ పెరుగుదల కనిపించింది. ఫలితంగా ఎన్నికల్లో మా కూటమి తుడిచిపెట్టుకుపోయింది. ఇది చాలా అనుమానాస్పదంగా ఉందని” పేర్కొన్నారు. “లోక్​సభ, విధానసభ మధ్య ఎన్నికల వ్యవధిలో కోటి మంది కొత్త ఓటర్లు చేరినట్లు మేము గుర్తించాం. మేము ఎన్నికల కమిషన్​కు (Election Commisssion) వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశాం. కానీ వాళ్లు మాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఓటర్ల జాబితా ఇవ్వమని కోరినా పట్టించుకోలేదని” అని తెలిపారు. అంతేకాదు, ఓటరు జాబితాను ఇవ్వడానికి నిరాకరించిన ఈసీ.. ఆపై వారు చాలా ఆసక్తికరమైన పని చేశారని, CCTV ఫుటేజ్​ను నాశనం చేయబోతున్నామని చెప్పారన్నారు. ఇది మరింత ఆశ్చర్యం కలిగించిందని, ఎందుకంటే మహారాష్ట్రలో సాయంత్రం 5.30 తర్వాత భారీగా పెరిగిన ఓటింగ్ పై అనేక అనుమానాలున్నాయి. వాస్తవానికి 5.30 తర్వాత భారీ ఓటింగ్ జరగలేదు. ఈ రెండు విషయాలు భారత ఎన్నికల కమిషన్ ఎన్నికలను దొంగిలించడానికి బీజేపీతో కుమ్మక్కవుతుందన్న వాదనకు బలం చేకూర్చుతోందని ఆరోపించారు.

    READ ALSO  Election Commission | ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు చిదంబరం సంచలన ఆరోపణలు

    Latest articles

    Viral Video | బాయ్‌ఫ్రెండ్‌కి చిరాకు తెప్పించిన మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | దేశంలో వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కుండపోత...

    Collector Nizamabad | డొంకేశ్వర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల...

    Manchu Lakshmi | మంచు ల‌క్ష్మిని ఆట ప‌ట్టించిన బ‌న్నీ కూతురు.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన క్యూట్...

    YS Sunitha | న్యాయం కోసం పోరాడాలి అన్నా సెక్యూరిటీ త‌ప్ప‌నిస‌రి అయింది.. వైఎస్ సునీత కామెంట్స్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Sunitha | కడప జిల్లా(Kadapa District) పులివెందులలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న...

    More like this

    Viral Video | బాయ్‌ఫ్రెండ్‌కి చిరాకు తెప్పించిన మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | దేశంలో వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కుండపోత...

    Collector Nizamabad | డొంకేశ్వర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల...

    Manchu Lakshmi | మంచు ల‌క్ష్మిని ఆట ప‌ట్టించిన బ‌న్నీ కూతురు.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన క్యూట్...