Homeజిల్లాలుజగిత్యాలRagging | జేఎన్టీయూలో ర్యాగింగ్​ కలకలం.. పట్టించుకోని కాలేజీ యాజమాన్యం

Ragging | జేఎన్టీయూలో ర్యాగింగ్​ కలకలం.. పట్టించుకోని కాలేజీ యాజమాన్యం

జగిత్యాల జిల్లా నాచుపల్లిలో జేఎన్టీయూలో ర్యాగింగ్​ కలకలం రేపింది. ఇంటరాక్షన్​ పేరుతో సీనియర్లు ఫస్టియర్ విద్యార్థులను వేధించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ragging | ర్యాగింగ్​ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. కొన్నేళ్లుగా ర్యాగింగ్​ అంతగా లేదు. అయితే ఇటీవల మళ్లీ సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్​ పేరిట వేధించడం మొదలు పెట్టారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని జేఎన్టీయూలో (JNTU in Jagtial district) ర్యాగింగ్​ కలకలం రేపింది.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జేఎన్టీయూ కాలేజీ (JNTU college) ఉంది. ఇంట్రాక్షన్​ పేరుతో సీనియర్లు జూనియర్లు ర్యాగింగ్​ చేశారు. బీటెక్​ సెకండియర్​ విద్యార్థులు (BTech second-year students) కొత్తగా చేరిన వారిని మానసికంగా వేధించారు. వారి వేధింపులతో భయపడిన పలువురు విద్యార్థులు తరగతులకు హాజరు కాలేదు.

Ragging | పట్టించుకోని అధికారులు

ఈ ఘటనపై జూనియర్లు కాలేజీ ప్రొఫెసర్లకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా కానీ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం (college management) తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు ఇబ్బందులు పడుతుంటే పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Ragging | గతంలో తీవ్రంగా..

రాష్ట్రంలోని ఇంజినీరింగ్​, మెడికల్ కాలేజీల్లో ఒకప్పుడు ర్యాగింగ్​ ఘోరంగా ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్​ నగరంలోని (Hyderabad city) పలు కాలేజీల్లో సీనియర్ల వేధింపులతో జూనియర్లు ఆత్మహత్యలు సైతం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. 2010కి ముందు ర్యాగింగ్​ తీవ్రంగా ఉండేది. దీంతో సీనియర్లు కనిపిస్తే జూనియర్లు భయపడే వారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం మార్పు వచ్చింది. హైదరాబాద్ నగర కమినర్​గా ఏకే ఖాన్​ పనిచేసిన సమయంలో ఇంజినీరింగ్​ కాలేజీలకు వార్నింగ్​ ఇచ్చారు. ర్యాగింగ్​ జరిగితే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని కాలేజీల్లో యాంటి రాగింగ్​ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అప్పటి నుంచి ర్యాగింగ్​ అంతగా లేదు.

Ragging | పెరుగుతున్న ఘటనలు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల మళ్లీ ర్యాగింగ్​ కలకలం రేపుతుంది. నల్లగొండ మెడికల్‌ కాలేజీలో (Nalgonda Medical College) ఇటీవల ఫస్ట్‌యిర్‌ వైద్య విద్యార్థులను రెండో ఏడాది చదువుతున్న సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినందుకు మరోసారి ర్యాగింగ్​కు పాల్పడ్డారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సైతం ఇటీవల ఇలాంటి ఘటన జరిగింది. ర్యాగింగ్​లో ఒ ప్రొఫెసర్​ కూడా పాల్గొన్నాడు. దీంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం స్మార్ట్​ఫోన్​, వెబ్​ సిరీస్​ల ప్రభావంతో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. సమాజాన్ని, చట్టాలను లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో ర్యాగింగ్​ ఘటనలు సైతం పెరుగుతున్నాయి.

Must Read
Related News