Transco Nizamabad | నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యం: ట్రాన్స్​కో ఎస్​ఈ రాపెల్లి రవీందర్​

అక్షరటుడే, వర్ని: Transco Nizamabad | రైతులు, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ట్రాన్స్​కో ఎస్​ఈ రాపెల్లి రవీందర్​ (Transco SE Rapelli Ravinder) పేర్కొన్నారు. వర్ని మండలం (Varni mandal) కూనీపూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో అదనంగా 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్​ఫార్మర్​ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అదనపు పవర్ ట్రాన్స్​ఫార్మర్లు, ఇంటర్ లింకింగ్ లైన్లు, కొత్త బ్రేకర్ల ఏర్పాటు పనులు వేగంగా […]

అక్షరటుడే, వర్ని: Transco Nizamabad | రైతులు, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ట్రాన్స్​కో ఎస్​ఈ రాపెల్లి రవీందర్​ (Transco SE Rapelli Ravinder) పేర్కొన్నారు.

వర్ని మండలం (Varni mandal) కూనీపూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో అదనంగా 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్​ఫార్మర్​ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అదనపు పవర్ ట్రాన్స్​ఫార్మర్లు, ఇంటర్ లింకింగ్ లైన్లు, కొత్త బ్రేకర్ల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జలాల్​పూర్​, జాకోరా ఉపకేంద్రాల్లో (Jalalpur and Zakora substations సాంకేతిక సమస్యలు వచ్చినా విద్యుత్ నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అత్యవసర సమయంలో టోల్​ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు. రైతులు (Farmers) ట్రాన్స్​ఫార్మర్ల వద్ద స్వయంగా ఫ్యూజ్‌లు మార్చవద్దని హెచ్చరించారు. జంపర్లు, లూజ్ లైన్లు, ట్రాన్స్​ఫార్మర్లలో లోపాలు వంటి సమస్యలుంటే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈ ఆపరేషన్స్​ బోధన్ ఎండీ ముక్తార్, డీఈ ఎంఆర్​టీ నిజామాబాద్ వెంకటరమణ, రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్, ఏడీఈ టీఆర్ఈ నటరాజ్, వర్ని ఏఈ శ్రీనివాస్, సాయిలు, బాలకిషన్, వేణుగోపాల్, శ్రీనివాస్, ఏఎంసీ ఛైర్మన్ సురేష్ బాబా, కూనిపూర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related articles

RTC Bus Falls Into Valley | లోయలో పడిన బస్సు : ప్రయాణికులకు గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

India Semi Chances | సూపర్ 8లో టీమిండియాకు భారీ షాక్.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేదా?

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీ 20 సూపర్ 8 దశలో భార‌త జ‌ట్టుకు గట్టి దెబ్బ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినా, సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక విజయం సాధించాల్సిందే.

ex-railway-minister mukul roy | విషాదం.. గుండెపోటుతో రైల్వే మాజీ మంత్రి కన్నుమూత

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ex-railway-minister mukul roy | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (71)...

Feb 23 Gold Prices | బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 23 Gold Prices | బంగారం, వెండిధ‌ర‌లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ బంగారం ధరలు ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి....