అక్షరటుడే, వెబ్డెస్క్: IPL 2025 | రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులకు ఎంతో మజానిచ్చిన ఐపీఎల్(IPL) ముగింపు దశకు చేరుకుంది. ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్(PBKS), ముంబయి ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ ఉంది. అహ్మాదాబాద్ (Ahmadabad)లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు నుంచి వర్షం ప్రారంభం అయింది. దీంతో మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం వర్షం తగ్గడంతో గ్రౌండ్ స్టాఫ్ కవర్లు తొలగిస్తున్నారు. వర్షం తగ్గితే మ్యాచ్ ప్రారంభించనున్నారు. వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే కేటాయించారు. దీంతో రేపు మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం అహ్మాదాబాద్లో వర్షం తగ్గడంతో మరి కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.