అక్షరటుడే, హైదరాబాద్: Pushpa-2 Sandhya Theater : సంధ్య థియేటర్ లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబరు 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది.
ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయాడు. దీంతో బాలుడిని హాస్పిటల్ కు అక్కడి నుంచి రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. అప్పటి నుంచే అక్కడే చికిత్స పొంది, తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్గా ఉందని బాలుడి తండ్రి తెలిపారు.