HomeUncategorizedPunjab Spurious Liquor | పంజాబ్​ కల్తీ మద్యం.. 23కు చేరిన మృతుల సంఖ్య

Punjab Spurious Liquor | పంజాబ్​ కల్తీ మద్యం.. 23కు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab Spurious Liquor | పంజాబ్​లో కల్తీ మద్యం మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటి వరకు కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. మంగళవారం 21 మంది మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను బుధవారం అమృత్​సర్​ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండు విధించింది.

అమృత్​సర్ జిల్లా భంగాలీ, పతాల్​పురీ, తల్వాండి ఖుమ్మన్, కర్నాలా, మరారి, కలన్, భంగ్వాన్, థెరేవల్ గ్రామాలకు చెందిన పలువురు సోమవారం(మే 12న) రాత్రి కల్తీ మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే గురుద్వారాల ద్వారా ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు.

Punjab Spurious Liquor : రూ.10 లక్షల పరిహారం

బాధిత కుటుంబాలను మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్​ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. నిందితులను వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Must Read
Related News