Prajavani
Prajavani | ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టరేట్​లో (Collectorate) సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 112 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​తో పాటు, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి (Trainee Collector Caroline Chingtianmavi), డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావులకు వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.