Prajavani | ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
Prajavani | ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

అక్షరటుడే ఇందూరు:Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్​(Collectorate)లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్​తోపాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఇన్​ఛార్జి ఆర్డీవో స్రవంతి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.