అక్షరటుడే, ఇందూరు: MP Arvind | ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యం అందించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నగరంలోని ఖలీల్వాడిలో(Khaleelwadi) డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ను (Naveen Super Speciality Eye Hospital) శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో అందరికీ అందుబాటులో వైద్యం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏలేటి మల్లికార్జున్, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
