ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి: ఎస్పీ

    SP Rajesh Chandra | పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి: ఎస్పీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పోలీసు శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన నలుగురు పోలీసులను జిల్లా పోలీస్ కార్యాలయంలో (Kamareddy SP Office)  సోమవారం అభినందించి పదోన్నతి చిహ్నాలను అలంకరించారు.

    నస్రుల్లాబాద్ (Nasrullabad) కానిస్టేబుల్ బి.వెంకటేశ్వర్లు, తాడ్వాయి (Tadwai) కానిస్టేబుల్ ఎస్.రమేష్ గౌడ్, బీర్కూర్ కానిస్టేబుల్ జి.శ్రీనివాస్​లకు పదోన్నతి రాగా డి.దామోదర్ రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లా నుండి కామారెడ్డికి వచ్చారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతులు పొందిన సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. ప్రజాసేవలో నిజాయితీగా పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందని, సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్లు లభిస్తాయని తెలిపారు.

    More like this

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...