అక్షరటుడే, వెబ్డెస్క్ : Inspector Promotions | రాష్ట్రంలోని పలువురు ఎస్సైలకు ప్రమోషన్ (Promotion to SI’s as inspector) కల్పించింది. మల్టి జోన్ –1 (Multi Zone-z) పరిధిలో పనిచేస్తున్న తొమ్మిది మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి (IG Chandra Shekar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ విభాగంలో పని చేస్తున్న తొమ్మిది మంది ఎస్సైలకు ప్రమోషన్ కల్పించారు.
పదోన్నతి పొందిన వారిలో.. సంగమూరి శివకృష్ణ(వరంగల్), మాధవి ప్రసాద్ (సీఐడీ), కన్నెబోయిన శ్రీకాంత్ (టీజీ ఏఎన్బీ), కె శ్రీనివాస్రెడ్డి (మెదక్), ఎస్ దీపక్ (పీటీసీ వరంగల్), కె నర్సింహరావు(హైడ్రా), బియ్యాని సంతోష్రావు(మహబూబాబాద్), పి ప్రభాకర్ (సీఐడీ), అబ్దుల్ రహీమ్(జగిత్యాల) ఉన్నారు. పదోన్నతి పొందిన ఆర్డర్ అందిన 15 రోజుల్లో సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని ఐజీ ఆదేశించారు. కాగా.. వీరికి నూతన స్థానాల్లో పోస్టింగులు ఇవ్వనున్నారు.