Promotion
Inspector promotions | తొమ్మిది మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి.. ఉత్తర్వులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inspector Promotions | రాష్ట్రంలోని పలువురు ఎస్సైలకు ప్రమోషన్ (Promotion to SI’s as inspector)​ కల్పించింది. మల్టి జోన్​ –1 (Multi Zone-z) పరిధిలో పనిచేస్తున్న తొమ్మిది మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ ఐజీ చంద్రశేఖర్​రెడ్డి (IG Chandra Shekar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్​ విభాగంలో పని చేస్తున్న తొమ్మిది మంది ఎస్సైలకు ప్రమోషన్​ కల్పించారు.

పదోన్నతి పొందిన వారిలో.. సంగమూరి శివకృష్ణ(వరంగల్​), మాధవి ప్రసాద్ (సీఐడీ)​, కన్నెబోయిన శ్రీకాంత్ (టీజీ ఏఎన్​బీ)​, కె శ్రీనివాస్​రెడ్డి (మెదక్​), ఎస్​ దీపక్ (పీటీసీ వరంగల్​)​, కె నర్సింహరావు(హైడ్రా), బియ్యాని సంతోష్​రావు(మహబూబాబాద్​), పి ప్రభాకర్​ (సీఐడీ), అబ్దుల్​ రహీమ్​(జగిత్యాల) ఉన్నారు. పదోన్నతి పొందిన ఆర్డర్​ అందిన 15 రోజుల్లో సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్​ చేయాలని ఐజీ ఆదేశించారు. కాగా.. వీరికి నూతన స్థానాల్లో పోస్టింగులు ఇవ్వనున్నారు.