Homeజిల్లాలునిజామాబాద్​Kallugeeta Workers Union | కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Kallugeeta Workers Union | కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ డిమాండ్ చేశారు. తాళ్ల కొత్తపేటలో 3వ కల్లు గీత కార్మిక సంఘం మహాసభలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Kallugeeta Workers Union | కల్లుగీత కార్మికుల (Kallu Geetha workers) సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ డిమాండ్​ చేశారు. తాళ్ల కొత్తపేట గ్రామంలోని (Talla Kothapet village) ఎల్లమ్మగుడి ఫంక్షన్​హాల్​లో మూడో జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి రాష్ట్ర సలహాదారు పెద్ది వెంకట్రాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. 1957లో ఏర్పడిన సంఘం ఇప్పటివరకు ఎంతోమంది గీత కార్మికుల సమస్యలను పరిష్కరించిందన్నారు. కల్లుగీత కార్మికుల కోసం కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందని.. కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కార్మికులకు రూ.2000 పింఛన్​ను రూ.4వేలకు పెంచుతామని.. కల్లుగీత కార్మికులు మృతి చెందితే ఎక్స్​గ్రేషియా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. సమస్యల పరిష్కారానికి భవిష్యత్​ పోరాటం కోసం కల్లుగీత కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Must Read
Related News