Homeజిల్లాలునిజామాబాద్​Education Department | ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

Education Department | ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం (Headmasters’ Association) జిల్లా కార్యవర్గం ఎన్నికైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర టీజీహెచ్​ఎంఏ అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్​ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా చొప్పదండి శ్రీనివాస్ ​(జెడ్పీహెచ్​ఎస్​, రావుట్ల), ప్రధాన కార్యదర్శి ఎర్రోజు రఘునందనాచారి (జెడ్పీహెచ్​ఎస్​, ధర్మోరా), జిల్లా కార్యవర్గ సభ్యులుగా కృష్ణాచారి (జెడ్పీహెచ్​ఎస్​, ఏర్గట్ల), సంధ్యారాణి (జెడ్పీహెచ్​ఎస్​, వాల్గోట్​ కలాన్​), సంతోష్​కుమార్​ (జెడ్పీహెచ్​ఎస్, సుంకేటి), ప్రభాకర్​ (జెడ్పీహెచ్​ఎస్​, మోర్తాడ్​), వెంకటయ్య (జెడ్పీహెచ్​ఎస్​,​ పాలెం) ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాజభాను చంద్రప్రకాశ్​ (Rajabhanu Chandraprakash) మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్లు కల్పించలేదన్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని ప్రధానోపాధ్యాయులకు డిప్యూటీ డీఈవో, డైట్​ లెక్చరర్​ తదితర పోస్టులను ప్రధానోపాధ్యాయులకు కల్పించాలని కోరారు. వేసవి సెలవుల్లో ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవుల్లో బదిలీలు (Transfers) నిర్వహించాలని కోరారు.

Must Read
Related News