ePaper
More
    HomeజాతీయంPM Modi | 6న జమ్మూ కశ్మీర్​లో పర్యటించనున్న ప్రధాని

    PM Modi | 6న జమ్మూ కశ్మీర్​లో పర్యటించనున్న ప్రధాని

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6న జమ్మూ కశ్మీర్​(Jammu and Kashmir)లో పర్యటించనున్నారు. ఆపరేషన్​ సిందూర్​ అనంతరం ఆయన జమ్మూ కశ్మీర్​ వెళ్లలేదు. ఇటీవల పహల్గామ్​ ఉగ్రదాడి, అనంతరం ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ నేపథ్యంతో భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్​లోని వివిధ వేదికల నుంచి పాక్​(Pakistan)కు, ఉగ్రవాదులకు మోదీ వార్నింగ్​ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్​ వెళ్లలేదు. ఈ క్రమంలో 6న ఆయన అక్కడ పర్యటించనున్నారు.

    చీనాబ్ రైల్వే బ్రిడ్జి(Chenab Railway Bridge)ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీకి ఇది జమ్మూకశ్మీర్‌కు తొలిసారి పర్యటన కావడంతో ఆసక్తి నెలకొంది. ఉగ్రవాదం అణచివేతపై ప్రధాని కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఉగ్రవాదం(Terrorism) అంతమే తమ లక్ష్యమని భారత్​ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...