ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​PM Modi | విశాఖలో 21న ప్రధాని మోదీ పర్యటన.. బీచ్ ​రోడ్డులో ట్రాఫిక్​ ఆంక్షలు

    PM Modi | విశాఖలో 21న ప్రధాని మోదీ పర్యటన.. బీచ్ ​రోడ్డులో ట్రాఫిక్​ ఆంక్షలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్​(Andhra Pradesh)లో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా జూన్​ 21న ఆయన విశాఖలో పర్యటిస్తారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు అణువణువు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బీచ్‌రోడ్‌లో మంగళవారం నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేవల్ కోస్ట్ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు రెడ్‌జోన్​ ప్రకటించారు. ఈనెల 21 వరకు 5 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం కూడా విధించారు. 21 వరకు ఆర్కే బీచ్‌ రోడ్డు(RK Beach Road) మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

    PM Modi | ప్రధాని షెడ్యూల్​ ఇదే..

    ప్రధాని మోదీ(PM Modi) విశాఖ ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకుంటారు. రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేస్తారు. 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 గంటల వరకు విశాఖ బీచ్‌(Visakhapatnam Beach)లో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) ఏర్పాట్లు చేస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...