ePaper
More
    HomeజాతీయంPM Modi | నేపాల్ యువతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. రోడ్లపై పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారని...

    PM Modi | నేపాల్ యువతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. రోడ్లపై పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారని వెల్లడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | యువత విధ్వంసంతో అల్లకల్లోలంగా నేపాల్ లో తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులైన సుశీలా కర్కి(Sushila Karki)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అభినందించారు. అదే సమయంలో హింసాత్మక చర్యలకు పాల్పడిన యువకులు ఇప్పుడు రోడ్లను శుభ్రం చేసే పనిలో పడ్డారని ప్రశంసించారు.

    మణిపూర్లో పర్యటించిన ప్రధాని మోదీ(PM Modi).. రూ. 1200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఇంఫాల్ లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. నేపాల్ భారతదేశానికి అత్యంత సన్నిహిత దేశమని తెలిపారు. “నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, 1.4 బిలియన్ల భారతీయుల తరపున సుశీలా జీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేపాల్లో(Nepal) శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ఆమె మార్గం సుగమం చేస్తుందని నేను విశ్వసిస్తున్నానని’’ పేర్కొన్నారు. పొరుగు దేశానికి భవిష్యత్తులో శాంతి, శ్రేయస్సు చేకూరుతుందని ఆకాంక్షించారు.

    PM Modi | యువత పై ప్రశంసలు..

    నేపాల్లో జరిగిన సంఘటనలలో మరో విషయం ముఖ్యంగా గమనించదగినదని, కానీ దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని ప్రధాని అన్నారు. జెన్ జెడ్(Gen Z) హింసాత్మక నిరసనల తర్వాత వీధులను శుభ్రం చేస్తున్న నేపాల్ యువతను ప్రశంసించారు. “గత రెండు-మూడు రోజులుగా నేపాల్ యువకులు, మహిళలు… రోడ్లపై శుభ్రపరచడం, పెయింటింగ్ పనులు చేస్తూ చాలా కష్టపడుతున్నారు. వారి చిత్రాలు సోషల్ మీడియాలో వస్తున్నట్లు నేను కూడా చూశాను. వారి సానుకూల ఆలోచన, ఈ సానుకూల పని స్ఫూర్తిదాయకం మాత్రమే కాదు, నేపాల్ కొత్త ఉదయానికి స్పష్టమైన సూచన కూడా. నేపాల్ ఉజ్వల భవిష్యత్తు కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని మోదీ తెలిపారు.

    More like this

    Balkonda Mandal | బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ

    అక్షర టుడే, బాల్కొండ: Balkonda Mandal | మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్ఓ రాజశ్రీ (DMHO Rajshri)...

    KTR | దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్​కు కేటీఆర్​ సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలనపై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​...

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...