HomeUncategorizedChenab Railway Bridge | చీనాబ్​ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే..

Chenab Railway Bridge | చీనాబ్​ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chenab Railway Bridge | జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ఇది. ఈ బ్రిడ్జి ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. కశ్మీర్ లోయను దేశంలోని ఇతర రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడానికి దీనిని నిర్మించారు. వందే భారత్​ రైలును ప్రారంభించి.. ఈ బ్రిడ్జిని ప్రధాని జాతికి అంకితం చేశారు.

Chenab Railway Bridge | ఎన్నో ప్రయోజనాలు

చీనాబ్​ రైల్వే వంతెనతో ఇతర రాష్ట్రాల నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి(Shri Mata Vaishno Devi) – కాట్రా వరకూ నేరుగా ట్రైన్​లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు ఇతర రాష్ట్రాల ప్రజలు శ్రీనగర్​కు వెళ్లాలంటే డైరెక్ట్​ ట్రైన్​ సౌకర్యం లేదు. దీంతో పర్యాటకులు విమానాలు లేదంటే.. జమ్ము వరకూ రైలులో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీనగర్(Srinagar)​ వెళ్లేవారు. తాజాగా చీనాబ్​ రైల్వేపై వంతెన నిర్మాణంతో నేరుగా కనెక్టివిటీ సౌకర్యం ఏర్పడింది.

Chenab Railway Bridge | అత్యంత ఎత్తయిన బ్రిడ్జి

చీనాబ్​ నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఇది ఈఫిల్​ టవర్(Eiffel Tower)​ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తు ఉంటుంది. భారీ భూకంపాలు, ప్రకృతి విపత్తులు తట్టుకునేలా దీనిని నిర్మించారు. 2002లో వంతెన పనులు మొదలు పెట్టగా.. నిర్మాణం పూర్తి చేసుకొని నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. తొలిదశలో కాట్రా – బారాముల్ల మధ్య రైలు నడపనున్నారు. కాగా.. ఈ బ్రిడ్జి పొడువు 1315 మీటర్లు. అనేక డిజైన్లు పరిశీలించిన తర్వాత ఆర్చి మోడల్​లో ఈ బ్రిడ్జిని కట్టారు.