ePaper
More
    Homeఅంతర్జాతీయంPM Modi | సైప్రస్​ చేరుకున్న ప్రధాని మోదీ

    PM Modi | సైప్రస్​ చేరుకున్న ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం సైప్రస్​ (Cyprus) దేశానికి చేరుకున్నారు. ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సైప్రస్​ చేరుకోగా.. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కాగా 23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్​లో పర్యటించడం గమనార్హం.

    సైప్రస్​ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కెనడా వెళ్తారు. ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు జూన్​ 16, 17 తేదీల్లో జరిగే జీ–7 సదస్సులో (G-7 Summit) పాల్గొంటారు. అనంతరం తిరుగు ప్రయాణంలో క్రొయేషియాను కూడా సందర్శిస్తారు.

    PM Modi | ప్రధాని మోదీని కలిసిన వ్యక్తి ఆనందం

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశంలో చాలా మంది అభిమానులు ఉంటారు. ప్రవాసుల్లో కూడా మోదీ అభిమానులు భారీగానే ఉంటారు. ఈ క్రమంలో సైప్రస్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని లిమాసోల్​ నగరంలో నరేందర్​ అనే వ్యక్తి కలిశాడు. ప్రధాని అక్కడ ప్రవాసులతో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్​ మోదీని క​వగా ఆయన కుమార్తెను ఆశీర్వాదించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “మోదీ నా కుమార్తెను ఆశీర్వాదించారు. మేము సంతోషంగా ఉన్నాము. ఇది మాకు జీవితంలో ఒకసారి లభించే అవకాశం” అని అన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...