అక్షరటుడే, ఇందూరు: Nizamabad DEO Ashok | తమ సమస్యలను పరిష్కరించాలని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు(Primary School HM) కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్(District Education Officer Ashok)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పీజీ హెచ్ఎంల మాదిరిగా తమకు కూడా శిక్షణ నిర్వహించాలని కోరారు. అలాగే కాంప్లెక్స్ సమావేశాల్లో కార్యదర్శి హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీఎస్ హెచ్ఎంలు మురళి, ప్రశాంత్ రెడ్డి, సురేష్ రెడ్డి, నరేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
