6
అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Suryanarayana Guptha | ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు అంతా మంచి జరగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇందుకోసం నగరంలోని కంఠేశ్వరాలయం(Kanteshwar Temple)లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత్ దాడులతో ఇప్పటికే దాయాది దేశానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. పహల్గామ్(Pahlgam) మృతులకు ఇది నిజమైన నివాళి అని తెలియజేశారు. దేశ ప్రధాని మోదీ సారథ్యంలో దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.