Homeజిల్లాలుకామారెడ్డిPower Cut | శుక్రవారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం

Power Cut | శుక్రవారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్ : Power Cut | నిజాంసాగర్​ విద్యుత్​ ఫీడర్​ లైన్​ మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో కరెంట్​ ఉండదని విద్యుత్​ శాఖ అధికారులు తెలిపారు. నిజాంసాగర్​ ఫీడర్​ హెడ్​లూయిస్​ సబ్​స్టేషన్​ నుంచి 33కేవీ పిట్లం సబ్​ స్టేషన్​ వరకు ఫీడర్​ లైన్​ మరమ్మతులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉదయం 06.30 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. మల్లూరు, నర్సింగ్​రావుపల్లి సబ్ స్టేషన్​ల పరిధిలో గల మల్లూరు, మల్లూరు తండా, వడ్డేపల్లి, వడ్డేపల్లి తండా, జక్కపూర్, నారింగరావు పల్లి, మంగలూరు, వెల్గనూర్ గ్రామాల్లో కరెంట్​ ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.