Homeజిల్లాలుకామారెడ్డిPostal Department | 21న పోస్టల్​ సేవలు బంద్​.. ఎందుకో తెలుసా..?

Postal Department | 21న పోస్టల్​ సేవలు బంద్​.. ఎందుకో తెలుసా..?

- Advertisement -

అక్షరటుడే,ఇందూరు: Postal Department | ఉమ్మడి జిల్లాలోని తపాలాశాఖలో రానున్న రోజుల్లో కొత్త సాఫ్ట్​వేర్​ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి గురువారం పోస్టల్​ ఉద్యోగులకు (Postal employees) సీనియర్​ సూపరింటెండెంట్​ ఆఫ్​ పోస్ట్​ ఆఫీసెస్​ జనార్ధన రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని 3 హెడ్ పోస్టాఫీసుల్లో, 60 సబ్ పోస్ట్ ఆఫీసులు, 419 బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో ఈ సౌకర్యం రానుందన్నారు.

Postal Department | పోస్టల్​ శాఖలో ఐటీ 2.0 ద్వారా సేవలు..

ఈ సందర్భంగా జనార్ధన్​ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ కోసం పైలట్​ ప్రాజెక్ట్​గా నల్గొండ జిల్లాను ఎంపిక చేశారన్నారు. అక్కడ కొత్త సాఫ్ట్​వేర్​ సక్సెస్​ కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈనెల 22వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుందన్నారు.

Postal Department | ఈనెల 22వ తేదీ నుంచి అమలు..

రాష్ట్రంలోని మిగతా అన్నీ జిల్లాల్లో ఈనెల 22వ తేదీనుండి ఈ IT 2.0 ద్వారా తపాలా సేవలు అందించబడతాయని ఆయన పేర్కొన్నారు. పోస్టాఫీసుల్లోని అన్ని సేవలు కొత్త సాఫ్ట్​వేర్​ ద్వారానే పనులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలకు చెక్​ పెట్టేందుకు కేంద్రం ఈ స్టాఫ్ట్​వేర్​ను అప్​డేట్​ చేసిందని పేర్కొన్నారు.

Postal Department | 21న పోస్టల్​ సేవలు బంద్​..

కొత్తగా సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేస్తున్న సందర్భంగా నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలో ఈనెల 21వ తేదీన పోస్టాఫీస్​లలో సేవలు నిలుపేస్తున్నట్లుగా ఆయన వివరించారు. దీనికి సంబంధించి 18, 19 తేదీల్లో ప్రిపరేటరీ వర్క్​ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించాలనే సదుద్దేశంతో ఈ మార్పు జరుగుతోందన్నారు. కార్యక్రమంలో పోస్టల్​ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.