​Telangana Formation Day
​Telangana Formation Day | మహోన్నత సేవా పతకం అందుకున్న పొల్లు రవీందర్

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​Telangana Formation Day | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 37 సేవాపథకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నిజామాబాద్​ సీసీఎస్​ విభాగంలో ఇన్​స్పెక్టర్​ పొల్లు రవీందర్​ (CCS Inspector Pollu Ravinder) మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. గతంలోనూ ఆయన ప్రెసిడెంట్​ మెడల్​ను (President Medal) అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో పాటు రూ.40వేల క్యాష్​ రివార్డ్​, సర్టిఫికెట్​ను అందుకున్నారు. కాగా.. మహోన్నత సేవా పతకాన్ని త్వరలో అందుకోనున్నారు.