Land encroachment | పదిశాతం స్థలం కబ్జా వెనుక ఓ ప్రజాప్రతినిధి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Land encroachment | నిజామాబాద్​ నగర శివారులోని ముబారక్​ నగర్​లో ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీని వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా.. కబ్జాకు పాల్పడిన స్థలం విలువ రూ. 15 కోట్ల పైచిలుకు ఉండడం గమనార్హం. నగర శివారులోని ముబారక్​ నగర్​ పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలో గతంలో ఏకశిలా నగర్​ పేరిట కొందరు వెంచర్​ను డెవలప్​​ చేశారు. ఈ క్రమంలో జీపీ నిబంధనల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Land encroachment | నిజామాబాద్​ నగర శివారులోని ముబారక్​ నగర్​లో ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీని వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా.. కబ్జాకు పాల్పడిన స్థలం విలువ రూ. 15 కోట్ల పైచిలుకు ఉండడం గమనార్హం.

నగర శివారులోని ముబారక్​ నగర్​ పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలో గతంలో ఏకశిలా నగర్​ పేరిట కొందరు వెంచర్​ను డెవలప్​​ చేశారు. ఈ క్రమంలో జీపీ నిబంధనల ప్రకారం పది శాతం స్థలాన్ని వదిలేశారు. తదనంతరం గ్రామ పంచాయతీకి అప్పగించారు. కాలక్రమేణ ఈ జీపీ నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో విలీనం కావడం, రికార్డులు గల్లంతవడం భూ అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దీనిని అదునుగా చేసుకుని ఓ ఉద్యోగ సంఘం నేత, మరో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కలిసి సదరు పది శాతం స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సదరు స్థలాన్ని చదును చేసి తిరిగి అమ్మకాలు మొదలు పెట్టారు.

Land encroachment | పెద్దల అండదండలు

నిజామాబాద్​ నగర శివార్లలోని ఏ ప్రాంతంలో చూసినా భూముల ధరలు రూ. ఎకరం కోట్లలో పలుకుతున్నాయి. ముబారక్​ నగర్​ ప్రాంతంలో గజం రూ. 10వేలు పైబడి పలుకుతోంది. ప్రస్తుతం ఏకశిలా నగర్​లో కబ్జాకు గురైన స్థలం మొత్తం 10వేల గజాల పైచిలుకు విస్తీర్ణం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. దీని వెనుక ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని, అక్రమార్కులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

Land encroachment | ప్రజావాణిలో ఫిర్యాదు

ఈ విషయమై స్థానికులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించారు. వెంటనే స్పందించి స్థలాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...