Homeతాజావార్తలుVikarabad | పోలీస్ వాహనాలు శుభ్రం చేస్తుండగా కరెంట్​ షాక్.. హోమ్​గార్డు మృతి

Vikarabad | పోలీస్ వాహనాలు శుభ్రం చేస్తుండగా కరెంట్​ షాక్.. హోమ్​గార్డు మృతి

ఎస్పీ కార్యాలయంలో పోలీస్​ వాహనాలను శుభ్రం చేస్తుండగా.. కరెంట్​ షాక్​ కొట్టి హోమ్​ గార్డు చనిపోయాడు. ఈ ఘటన వికారాబాద్​లో చోటుచేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vikarabad | విద్యుత్​ షాక్​తో ఓ హోమ్​గార్డు (Home Guard) మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లా ఎస్పీ కార్యాలయం (Vikarabad District SP Office)లో చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా (Rangareddy District) చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్​ ఎస్సీ కార్యాలయంలో హోమ్​గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసు వాహనాలను శుభ్రం చేస్తున్న క్రమంలో ఆయనకు కరెంట్​ షాక్​ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రి (Vikarabad Government Hospital)కి తరలించారు. విధులకు వెళ్లిన శ్రీనివాస్​ విద్యుత్​ షాక్​తో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్పీ నారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.