HomeతెలంగాణKodangal | తోపుడు బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

Kodangal | తోపుడు బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : kodangal | అంబులెన్స్​ (ambulance) లేకపోవడంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు తోపుడు బండిపై తీసుకెళ్లారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో (Narayanpet district) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో (Social Media) వైరల్​ అవుతున్నాయి.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్​ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​పై వెళ్తున్న దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన మొగులప్ప (28)ను టిప్పర్​ ఢీకొంది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే 108కు ఫోన్​ చేసినా అందుబాటులో లేదు. దీంతో మృతదేహాన్ని ఓ తోపుడు బండిపై వేసుకొని అర కిలోమీటర్​ దూరంలో ఉన్న ఆస్పత్రి వరకు లాక్కెళ్లారు.

kodangal | తీవ్ర విమర్శలు

మృతదేహాన్ని తోపుడి బండిపై తీసుకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతున్నారు. మృతదేహాన్ని ఇలా తీసుకు వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పేదవాడి మృతిపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై మండి పడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)