Homeజిల్లాలునిజామాబాద్​Cricket tournament | పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

Cricket tournament | పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

పోలీస్​ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా క్రికెట్​ టోర్నమెంట్​ నిర్వహిస్తున్నారు. వివిధ మండలాలకు చెందిన యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Cricket tournament | పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో జానకంపేటలోని పోలీస్​ ట్రైనింగ్ సెంటర్​లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas) హాజరై బుధవారం టోర్నీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. శారీరకంగా దృఢంగా ఉండాలని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్​లో బోధన్, సాలురా, ఎడపల్లి, రెంజల్​ మండలాల నుంచి 25 టీంలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో బోధన్​ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై రమ, బోధన్ రూరల్ ఎస్సై మశ్చేందర్​రెడ్డి పాల్గొన్నారు.