అక్షరటుడే, వెబ్డెస్క్ : Falaknuma Express | తెలంగాణలోని ఘట్కేసర్ (Ghatkesar) రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
హౌరా నుంచి సికింద్రాబాద్ (Secunderabad) వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ (Railway Station)లో అధికారులు ట్రెయిన్ను నిలిపి వేసి తనిఖీలు చేపడుతున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్కేసర్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సుమారుగా గంట నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా రైలులో నిజంగానే ఉగ్రవాదులు ఉన్నారా.. లేక కావాలని ఎవరైన నకిలీ ఫోన్కాల్ చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల దేశంలో ఉగ్రలింకులు బయట పడుతున్న తరుణంలో ట్రెయిన్లో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. జార్ఖంఢ్లో కొన్ని రోజుల క్రితం ఉగ్రవాది అజార్ డానిష్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్లో ఐసీస్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రైలులో టెర్రరిస్టులు ఉన్నారనే వార్తలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.