ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిలో ఒకరు మైనర్ కాగా మరొకరు ఆర్మీలో (ARMY) ఉద్యోగం వదిలి ముఠాలో పని చేస్తున్నాడు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (Sp Rajesh Chandra) శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గత నెల 25న కామారెడ్డిలో ఓ వ్యక్తి తనను కొందరు వ్యక్తులు ఫొటోలు మార్ఫింగ్ (Photo morphing) చేసి సోషల్ మీడియాలో (Social media) అప్​లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

    Kamareddy | ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో విచారణ

    కామారెడ్డి(Kamareddy) సబ్​డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి Subdivision ASP Chaitanya Reddy ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. బాధితుడు డబ్బులు పంపిన ఫోన్​పే ట్రాన్సక్షన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు కామారెడ్డికి చెందిన వారిగా గుర్తించారు. శనివారం సంబంధిత నేరస్థులు కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరిని విచారించగా సుమారు 40-50 మంది వద్ద ఇలాగే డబ్బులు తీసుకున్నట్టుగా ఒప్పుకున్నారు.

    READ ALSO  Kamareddy | స్కూటీకి నకిలీ నంబర్​ ప్లేట్​.. కేసు నమోదు చేసిన పోలీసులు

    అయితే వీరిపై ప్రస్తుతం కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు, తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, నిజామాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి. నేరస్థులు కామారెడ్డి పట్టణానికి చెందిన షేక్ జోహాబ్, మహమ్మద్ మిరాజ్ పాషా, సయ్యద్ ముజఫర్ అలీ, ఒక మైనర్, సిరిసిల్ల మండలం చంద్రంపేటకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి షేక్ సోహైల్​లను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు.

    వీరు సోషల్ మీడియా ద్వారా యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని యాప్​ల ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని వారిని మీటింగ్ ఉందని కామారెడ్డి పట్టణంలోని మేఘా కార్ షెడ్ వద్దకు పిలిచి మీ చాటింగ్స్ మావద్ద ఉన్నాయి. మీ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించి కొడుతూ వారి వద్ద ఉన్న నగదు, వస్తువులు లాక్కుంటారని తెలిపారు. మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా బాధితుల ఫోన్ల నుంచి డబ్బులు ట్రాన్సక్షన్ చేసుకుంటారని వెల్లడించారు.

    READ ALSO  Pocharam project | పోచారం ప్రాజెక్టులోకి భారీగా ఇన్​ఫ్లో.. 15.3 అడుగులకు చేరిన నీటిమట్టం

    ఇలా ఇప్పటివరకు వీరు రూ. 7లక్షల నుంచి 8 లక్షల వరకు డబ్బులు దోచుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రూ.96,350 రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్న బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. నాందేడ్ జిల్లాకు చెందిన బాధితులు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. సోషల్ మీడియా, యాప్స్ ద్వారా పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని ఎస్పీ సూచించారు.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...