అక్షరటుడే, వెబ్డెస్క్ : ఓ కానిస్టేబుల్పై పోలీసులు పోక్సో కేసు (Pocso Case) నమోదు చేశారు. సూర్యాపేట (Suryapeta) జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఓ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఇప్పటికే అతడిని సస్పెండ్ చేశారు. తాజాగా పోక్సో కేసు నమోదు చేశారు.
సూర్యాపేట (Suryapet) జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో కృష్ణంరాజు కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. అయితే ఆయనకు గతంలోనే మూడు పెళ్లిలు అయ్యాయి. 2023 నాలుగో సారి బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. సూర్యాపేట మండలానికి చెందిన బాలికను సదరు కానిస్టేబుల్ వివాహం చేసుకోగా.. ఎస్పీ నరసింహ (SP Narasihma) విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. తాజాగా ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.
బాల్య వివాహాలను (Child Marriages) అరికట్టాల్సిన కానిస్టేబుల్ బాలికను వివాహం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.