Pocharam's son Bhaskar Reddy | భారాస నేతలపై విరుచుకుపడ్డ పోచారం తనయుడు భాస్కర్​రెడ్డి
Pocharam's son Bhaskar Reddy | భారాస నేతలపై విరుచుకుపడ్డ పోచారం తనయుడు భాస్కర్​రెడ్డి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pocharam’s son Bhaskar Reddy | పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి MLA Pocharam Srinivas Reddy పై ఉభయ జిల్లాల భారాస ఎమ్మెల్యేలు, నేతలు కామెంట్లు చేసిన నేపథ్యంలో.. భారాస నేతలపై పోచారం తనయుడు భాస్కర్​రెడ్డి విరుచుకుపడ్డారు.

ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు జీవన్​ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్​రెడ్డిని పాండుగా పేర్కొన్నారు.

తెలంగాణ రావడంతో విచ్చలవిడిగా సంపాదించుకుని, అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారన్నారు. తమ నాయకుడు పోచారం శ్రీనివాస్​రెడ్డి వల్లనే బీఆర్​ఎస్​ నేతలు డబ్బులు సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

Pocharam’s son Bhaskar Reddy | ఖబర్దార్​ జీవన్​రెడ్డి..

జీవన్​రెడ్డి తన తండ్రిని బాపూ అని పిలుస్తారని, అలాంటిది ఇప్పుడేమో పోచారం శ్రీనివాస్​రెడ్డిని శనిగా పేర్కొనడం బాధాకరమన్నారు.

ఖబర్దార్​ జీవన్​రెడ్డి.. 2018లో 36 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన నీవు.. మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయావు.. అదీ నీ స్థానం.. ఈ విషయం అధిష్ఠానానికి కూడా తెలుసు.. అని అన్నారు.

జీవన్​రెడ్డిని భాస్కర్​రెడ్డి బ్రోకర్​గా వర్ణించారు. తన పనులు చేయించుకునేందుకు ఎవరెవరి వద్ద ఎంత మంది అమ్మాయిలను పడుకోబెట్టారో తనకంతా తెలుసన్నారు. ఈ విషయం జీవన్​రెడ్డిని ఇంటరాగేట్​ చేస్తే.. అన్నీ కక్కేస్తారని చెప్పుకొచ్చారు.

Pocharam’s son Bhaskar Reddy | బాజిరెడ్డి గోవర్ధన్​ మా మేనమామని చంపించారు..

నిజామాబాద్​ రూరల్​ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో బాజిరెడ్డి గెలిచి, రౌడీ రాజకీయాలు చేశారని ఆరోపించారు. తన మేనమామను చంపించింది బాజిరెడ్డినేనని పేర్కొన్నారు.

2014, 2018 లలో పోచారం శ్రీనివాస్​రెడ్డిని ఓడించేందుకు బాజిరెడ్డి, షకీల్​, ఏనుగు రవీందర్​రెడ్డి కలిసి తీవ్ర ప్రయత్నం చేశారన్నారు.

బాజిరెడ్డి ఆర్మూర్​, అర్బన్​.. తదితర నియోజకవర్గాల్లో వేలు పెట్టారని అందుకే అక్కడ బీఆర్​ఎస్​ BRS  ఓడిపోయిందన్నారు. మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డిని బాజిరెడ్డి, జీవన్​రెడ్డి, షకీల్​, గణేశ్​ గుప్తా తిట్టారని.. అందరూ కలిసి ఒకరినొకరు ఓడగొట్టుకున్నారని అన్నారు.

స్పీకర్​గా చేసిన వ్యక్తి తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని, ఇదే విషయంపై పోచారం శ్రీనివాస్​రెడ్డిపై అందరూ కామెంట్​ చేశారని గుర్తుచేశారు. కానీ, ఆ పోచారం గెలిచి ఆ అపవాదను తొలగించారన్నారు.

Pocharam’s son Bhaskar Reddy | ప్రశాంత్​రెడ్డిపై కూడా కామెంట్స్..

జిల్లా మంత్రిగా పనిచేసిన ప్రశాంత్​రెడ్డికి కామారెడ్డి జిల్లాలో మాత్రమే మర్యాద ఉండిందని పేర్కొన్నారు. ఆర్మూర్​, అర్బన్​, బోధన్​, రూరల్​ నియోజవర్గాల్లో ఎవరూ పట్టించుకోలేదన్నారు. జిల్లాలో పట్టులేని వ్యక్తికి జిల్లా మంత్రిగా పదవి ఎలా ఇచ్చారో తెలియదన్నారు.

అధికారులను ప్రశాంత్​రెడ్డి తిట్టేవారన్నారు. ఎవరినీ సమన్వయం చేయలేదన్నారు. అసలు ప్రశాంత్​రెడ్డి అంటే.. బాజిరెడ్డి, జీవన్​రెడ్డి, షకీల్​, గణేశ్​గుప్తా తదితరులెవరికీ పడకపోయేదన్నారు.

హైదరాబాద్​లో అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటు చేసిన గుత్తేదారుకు బిల్లు మంజూరు చేయించి, అతడి వద్ద రూ. 6 కోట్లు తీసుకుని నియోజకవర్గంలో పంచండం వల్లనే ప్రశాంత్​రెడ్డి గెలిచారని ఆరోపించారు.

తనని బీసీసీఐ ఛైర్మన్​ పదవి నుంచి తొలగించడంలోనూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి కీలక పాత్ర పోషించి.. తనని వెన్నుపోటు పొడిచారన్నారు. అది తనకే కాకుండా కాంగ్రెస్​ నేతలతో కలిసి బీఆర్​ఎస్​కు కూడా వెన్నుపోటు పొడిచారన్నారు.