Homeజిల్లాలుకామారెడ్డిPocharam's son Bhaskar Reddy | భారాస నేతలపై విరుచుకుపడ్డ పోచారం తనయుడు భాస్కర్​రెడ్డి.. ఏమన్నారంటే..

Pocharam’s son Bhaskar Reddy | భారాస నేతలపై విరుచుకుపడ్డ పోచారం తనయుడు భాస్కర్​రెడ్డి.. ఏమన్నారంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pocharam’s son Bhaskar Reddy | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా బీఆర్​ఎస్ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) తనయుడు భాస్కర్​ రెడ్డి విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో బీఆర్​ఎస్​ నాయకులపై మండిపడ్డారు.

ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు జీవన్​ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్​రెడ్డిని పాండు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడంతో విచ్చలవిడిగా సంపాదించుకుని, అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారన్నారు. తమ నాయకుడు పోచారం శ్రీనివాస్​రెడ్డి వల్లనే బీఆర్​ఎస్​ నేతలు డబ్బులు సంపాదించుకున్నారని విమర్శించారు.

Pocharam’s son Bhaskar Reddy | ఖబర్దార్​ జీవన్​రెడ్డి..

జీవన్​రెడ్డి తన తండ్రిని బాపూ అని పిలుస్తారని, అలాంటిది ఇప్పుడేమో పోచారం శ్రీనివాస్​రెడ్డిని శని అంటూ పేర్కొనడం బాధాకరమన్నారు. ‘ఖబర్దార్​ జీవన్​రెడ్డి.. 2018లో 36 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన నీవు.. మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయావు.. అదీ నీ స్థానం.. ఈ విషయం అధిష్ఠానానికి కూడా తెలుసు..’ అని అన్నారు.

‘జీవన్​రెడ్డి ఓ బ్రోకర్. తన పనులు చేయించుకునేందుకు ఎవరెవరి వద్ద ఎంత మంది అమ్మాయిలను పడుకోబెట్టారో తనకంతా తెలుసు. ఈ విషయం జీవన్​రెడ్డిని ఇంటరాగేట్​ చేస్తే.. అన్నీ కక్కేస్తారు’ అని చెప్పుకొచ్చారు.

Pocharam’s son Bhaskar Reddy | బాజిరెడ్డి గోవర్ధన్​ మా మేనమామని చంపించారు..

నిజామాబాద్​ రూరల్​ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిపై కూడా భాస్కర్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో బాజిరెడ్డి గెలిచి, రౌడీ రాజకీయాలు చేశారని.. తన మేనమామను చంపించింది బాజిరెడ్డినేనని ఆరోపించారు. 2014, 2018లలో పోచారం శ్రీనివాస్​రెడ్డిని ఓడించేందుకు బాజిరెడ్డి, షకీల్​, ఏనుగు రవీందర్​రెడ్డి కలిసి తీవ్ర ప్రయత్నం చేశారన్నారు.

బాజిరెడ్డి ఆర్మూర్​, అర్బన్​.. తదితర నియోజకవర్గాల్లో వేలు పెట్టారని అందుకే అక్కడ బీఆర్​ఎస్​ BRS  ఓడిపోయిందన్నారు. మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డిని బాజిరెడ్డి, జీవన్​రెడ్డి, షకీల్​, గణేశ్​ గుప్తా తిట్టారని.. అందరూ కలిసి ఒకరినొకరు ఓడగొట్టుకున్నారని అన్నారు.

స్పీకర్​గా పని చేసిన వ్యక్తి తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని, ఇదే విషయంపై పోచారం శ్రీనివాస్​రెడ్డిపై అందరూ కామెంట్​ చేశారని గుర్తుచేశారు. కానీ, పోచారం గెలిచి ఆ అపవాదును తూడిచిపెట్టారన్నారు.

Pocharam’s son Bhaskar Reddy | ప్రశాంత్​రెడ్డిపై కూడా కామెంట్స్..

జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన ప్రశాంత్​రెడ్డికి కామారెడ్డి జిల్లాలో మాత్రమే మర్యాద ఉండిందని పేర్కొన్నారు. ఆర్మూర్​, అర్బన్​, బోధన్​, రూరల్​ నియోజవర్గాల్లో ఎవరూ పట్టించుకోలేదన్నారు. జిల్లాలో పట్టులేని వ్యక్తికి మంత్రిగా పదవి ఎలా ఇచ్చారో తెలియదన్నారు.

అధికారులను ప్రశాంత్​రెడ్డి తిట్టేవారన్నారు. ఎవరినీ సమన్వయం చేయలేదన్నారు. అసలు ప్రశాంత్​రెడ్డి అంటే.. బాజిరెడ్డి, జీవన్​రెడ్డి, షకీల్​, గణేశ్​గుప్తా తదితరులెవరికీ పడకపోయేదన్నారు.

హైదరాబాద్​లో అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటు చేసిన గుత్తేదారుకు బిల్లు మంజూరు చేయించి, అతడి వద్ద రూ. 6 కోట్లు తీసుకుని నియోజకవర్గంలో పంచండం వల్లనే ప్రశాంత్​రెడ్డి గెలిచారని ఆరోపించారు.

తనని బీసీసీఐ ఛైర్మన్​ పదవి నుంచి తొలగించడంలోనూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి కీలక పాత్ర పోషించి.. తనని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అంతే కాకుండా కాంగ్రెస్​ నేతలతో కలిసి బీఆర్​ఎస్​కు కూడా వెన్నుపోటు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Must Read
Related News