Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam | ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పోచారం సమీక్ష

Mla Pocharam | ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పోచారం సమీక్ష

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) హైదరాబాద్ (Hyderabad)​ నుంచి టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. మున్సిపల్​ అధికారులు, పట్టణ వార్డు ఇన్​ఛార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్​ కాసుల బాలరాజ్​ (Agro Industries Chairman Kasula Balaraju)​ సమీక్ష నిర్వహించగా.. సమావేశంలో అధికారులకు పోచారం ఫోన్​లో సూచనలు చేశారు.

పట్టణ కేంద్రంలో మొదటి విడతగా 260 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వార్డు ఇన్​ఛార్జి సభ్యులు ప్రతిఒక్కరూ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. నియోజవర్గంలోని బీర్కూర్(Birkoor), కిష్టాపూర్ (Kistapur), చించోలి, దామరంచ ఇసుక క్వారీల నుంచి ఇసుక అందుబాటులో ఉందని వివరించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయితే రూ. 4 లక్షలు లబ్ధిదారుల అకౌంట్లలో జమవుతుందని ఇంటి నిర్మాణం పూర్తయితే మిగతా రూ. లక్ష చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.