ePaper
More
    Homeఅంతర్జాతీయంPM Modi | చైనాలో పర్యటించనున్న మోదీ.. ట్రంప్​ టెంపరితనానికి చెక్​ పెట్టడానికేనా!

    PM Modi | చైనాలో పర్యటించనున్న మోదీ.. ట్రంప్​ టెంపరితనానికి చెక్​ పెట్టడానికేనా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 31 నుంచి సెస్టెంబర్​ 1వరకు చైనా (China)లో పర్యటించనున్నారు. టియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆయన పాల్గొననున్నారు. మోదీ చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. అనంతరం 2020లో గాల్వన్​ లోయలో చైనా –భారత్​ మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. చైనా సైనికులు గాల్వన్​లోకి చొచ్చుకురావడంతో జరిగిన ఇరు దేశాలకు చెందిన సైనికులు చనిపోయారు. అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ క్రమంలో మోదీ పర్యటనతో మళ్లీ సంబంధాలు మెరుగు పడే అవకాశం ఉంది.

    PM Modi | ట్రంప్​ టారిఫ్స్​ వేళ..

    భారత్​ రష్యా (Russia) నుంచి ఆయిల్, ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత చాలా దేశాలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని ఆపేశాయి. ఈ క్రమంలో పుతిన్​ ప్రభుత్వం భారత్​, చైనాలకు తక్కువ ధరకు ఇంధనం సరఫరా చేస్తామని ఆఫర్​ చేసింది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత భారత్ భారీగా ఇంధనం కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump)​ ఇటీవల భారత్​పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేగాకుండా సుంకాలు, పెనాల్టీలు మరింత పెంచుతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో మోదీ చైనా పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    PM Modi | కీలక పర్యటనలు

    భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్ (NSA Ajith Doval)​ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar)​ కూడా త్వరలో రష్యా వెళ్లనున్నారు. ఇంధనం, ఆయుధాల కొనుగోలు అంశంపై ఆయన కీలక చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో మోదీ ఈ నెల 30న మొదట జపాన్​లో పర్యటిస్తారు. అనంతరం చైనాకు వెళ్లారు. కాగా మోదీ 2019లో చైనాకు చివరిసారిగా వెళ్లినా.. 2024 అక్టోబర్​లో రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు. ఈ సమావేశంలోనే ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గాయి. కైలాస్​ మానస సరోవర యాత్రకు సైతం చైనా అనుమతి ఇచ్చింది.

    PM Modi | మూడు దేశాలు కలుస్తాయా..

    ప్రస్తుతం రష్యా, ఇండియా, చైనా బ్రిక్స్​ (BRICS) కూటమిలో సభ్య దేశాలు. బ్రిక్స్​ కరెన్సీ తీసుకు రావడానికి యత్నిస్తున్నాయి. దీంతో తమ డాలర్​ ఆధిపత్యానికి గండి పడుతుందని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ట్రంప్​ చైనాపై సైతం గతంలో సుంకాలు విధించారు. దీంతో భారత్​–చైనా బంధాలను మెరుగు పరుచుకోవడం ద్వారా అమెరికాకు చెక్​ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

    షాంఘై సహకార సంస్థ ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో 10 సభ్య దేశాలతో చర్చలు వాణిజ్యంతో పాటు ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రతపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలిసింది. భారతదేశం-చైనా సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఎస్​సీవోలో బెలారస్, చైనా, భారత్​, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్​, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.

    Latest articles

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    More like this

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...