HomeUncategorizedIndus River | ప్లీజ్​ నీళ్లివ్వండి.. భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

Indus River | ప్లీజ్​ నీళ్లివ్వండి.. భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indus River | పహల్​గామ్​​ ఉగ్రదాడి pahalgam terror attack అనంతరం భారత్​ తీసుకున్న చర్యలతో పాక్​ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏప్రిల్​ 22న జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో భారత్​ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్​పై చర్యలు చేపట్టింది. ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్యాలను Trades రద్దు చేసుకుంది. అంతేగాకుండా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని Indus Water Treaty కూడా రద్దు చేసింది. పాకిస్తాన్​కు సింధూ నది జలాలు వెళ్లకుండా గేట్లు మూసేసింది.

Indus River | ఆ నీరే కీలకం

పాకిస్తాన్​ pakistan తాగు, సాగు నీటికి సింధూ నది నీరే కీలకం. సింధూ నది జలాలు ఆపేస్తే పాకిస్తాన్​ ఏడారి అవుతుంది. అసలే ఎండాకాలం కావడంతో దాయాది దేశం నీటి ఎద్దడిని ఎదుర్కుంటోంది. ఈ క్రమంలో బుధవారం భారత్​కు లేఖ రాసింది. సింధూ జలాల ఒప్పందంపై పునఃసమీక్షించాలని లేఖలో కోరింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాకిస్తాన్​ పేర్కొంది.

Indus River | రక్తం–నీరు కలిసి ప్రవహించలేవు..

పహల్​గామ్​​ ఉగ్రదాడి తర్వాత భారత్​ ఆపరేషన్​ సిందూర్ operation sindoor చేపట్టి పాక్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పాక్​ డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ విమానాలతో భారత్​పై దాడి చేయగా మన రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. అనంతరం భారత్​ ప్రతిదాడులతో పాక్​ తీవ్రంగా నష్టపోయింది.

ఈ క్రమంలో రెండు దేశాలు కాల్పుల విరమణ ceasefireకు అంగీకరించాయి. ఆపరేషన్​ సిందూర్​ విజయంపై ప్రధాని మోదీ pm modi మాట్లాడుతూ.. రక్తం–నీరు కలిసి ప్రవహించలేవని స్పష్టం చేశారు. పాకిస్తాన్​ ఉగ్రవాదులను అంతం చేసే వరకు ఆ దేశానికి నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఆ దేశంతో పీవోకే pok, ఉగ్రవాదంపై తప్ప ఇతర విషయాలపై చర్చించమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పాక్ లేఖపై భారత్​ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Must Read
Related News