అక్షరటుడే, వెబ్డెస్క్ : Karimnagar | ప్రియుడి కోసం భర్త (Husband)లను హత్య చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పలువురు కట్టుకున్న వాడిని కడతేరుస్తున్నారు. తాత్కాలిక ఆనందం, సుఖాల కోసం జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే కరీంనగర్ (Karimnagar)లో చేసుకుంది. వారం క్రితం హత్య జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ నగరంలోని కిసాన్నగర్కు చెందిన సంపత్(45)కు భార్య రమాదేవి, కుమారుడు భరత్ ఉన్నారు. సంపత్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం (Library)లో స్వీపర్గా పనిచేసేవాడు. రమాదేవి సర్వపిండి అమ్ముతూ విక్రయించేది. అయితే మద్యానిక బానిసైన సంపత్ నిత్యం రమాదేవిని కొట్టేవాడు. ఈ క్రమంలో 8 నెలల క్రితం ఆమెకు కర్రె రాజయ్య(50) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
Karimnagar | అడ్డు తొలగించుకోవాలని..
రాజయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రమాదేవి మద్యానికి బానిసైన భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ మేరకు ఎలా హత్య చేయాలని యూట్యూబ్ (Youtube)లో చూసి, ప్రియుడికి చెప్పింది. ఈ క్రమంలో జులై 29న సంపత్ భార్యతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెంటనే రమాదేవి ఈ విషయాన్ని రాజయ్యకు తెలిపింది. అయితే వారిద్దరికి అంతకు ముందే పరిచయం ఉంది. దీంతో మద్యం తాగుదామని చెప్పి రాజయ్య, తన మిత్రుడు కీసరి శ్రీనివాస్తో కలిసి సంపత్ను తీసుకెళ్లాడు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద పూటుగా మద్యం తాగించిన తర్వాత.. రమాదేవి చెప్పినట్లు సంపత్ చెవిలో గడ్డిమందు పోశాడు. దీంతో ఆయన చనిపోయాడు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Karimnagar | ఏమి తెలియనట్లు నటన
భర్తను హత్య చేయించిన రమాదేవి ఏమీ తెలియనట్లు నటించింది. తన భర్త కనిపించడం లేదని పోలీసు(Police)లకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 1న సంపత్ మృతదేహం దొరికింది. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని కుమారుడు భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారించగా.. తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో రమాదేవితో పాటు ఆమె ప్రియుడు రాజయ్య, శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.