Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Traffic Police | నగరంలో ట్రాఫిక్​ క్రమబద్ధీకరణకు ప్రణాళిక.. మూడుచోట్ల పార్కింగ్​ పాయింట్లు..

Nizamabad Traffic Police | నగరంలో ట్రాఫిక్​ క్రమబద్ధీకరణకు ప్రణాళిక.. మూడుచోట్ల పార్కింగ్​ పాయింట్లు..

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Traffic Police | నగరంలో ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి. దీనికి సంబంధించి సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆధ్వర్యంలో ప్రణాళికలు వేశారు. రద్దీగా ఉండే ఖలీల్​వాడిలో (Khaleelwadi) ట్రాఫిక్​ నియంత్రణకు మూడుచోట్ల పార్కింగ్​ పాయింట్లు (Parking Points) ఏర్పాటు చేశారు.

Nizamabad Traffic Police | ఆస్పత్రులకు వచ్చే వారికి..

ముఖ్యంగా జిల్లా నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారు ఖలీల్​వాడిలో ట్రాఫిక్​ కారణంగా అనేక ఇబ్బందులు పడేవారు. రోగుల..రోగుల బంధువులు ఆస్పత్రులకు వెళ్లాలంటే గగనంగా మారేది. ఇరుకు రోడ్లకు ఇరువైపులా అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో ఖలీల్​వాడిలో నడవాలన్నా నరకంగా మారింది.

Nizamabad Traffic Police | మూడు ప్రాంతాల్లో..​

ఖలీల్​వాడిలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ట్రాఫిక్​ పోలీసులు పార్కింగ్​ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నారు. టూవీలర్స్, త్రీవీలర్స్, ఫోర్ వీలర్స్ కోసం వెహికల్ పార్కింగ్ స్థలాలను ఖరారు చేశారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం, పాత జిల్లా విద్యాశాఖ కార్యాలయం, వెజ్, నాన్​వెజ్ మార్కెట్​ను వాహనాల పార్కింగ్​కు ఏర్పాటు చేశారు.

Nizamabad Traffic Police | ఐఎంఏతో గతంలో సమావేశం..

సీపీ సాయిచైతన్య నాలుగైదు రోజుల క్రితం నగరంలో ఐఎంఏ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఖలీల్​వాడిలో ట్రాఫిక్​ నియంత్రణకు వారి నుంచి పలు సూచనలు సలహాలు స్వీకరించారు. అనంతరం పలు చర్యలు తీసుకున్నారు. ఖలీల్​వాడిలో మొత్తంగా వన్​వే ఏర్పాటు చేశారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో వాహనాలు పార్కింగ్ చేయాలని నిర్ణయించారు.

Nizamabad Traffic Police | ట్రాఫిక్​ పోలీసుల ఆధ్వర్యంలో..

ఈ మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ(Traffic ACP Mastan Ali), ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​లకు (Inspector Prasad) సీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​, సిబ్బంది రాజీవ్ గాంధీ పార్కింగ్​కు ఏర్పాట్లు చేసి ఖలీల్​ వాడికి వచ్చే వాహనదారులకు అవగాహన కల్పించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పెయిడ్ పార్కింగ్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి చార్జీ వసూలు చేయడం లేదు.

అదేవిధంగా పార్కింగ్ కోసం రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరో రెండు రోజులలో పాత డీఈఓ ఆఫీస్​తో పాటు వెజ్ నాన్ వెజ్ మార్కెట్లలో కూడా పార్కింగ్​లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని నగర ప్రజలు స్వాగతిస్తున్నారు.

నగరంలోని రాజీవ్​గాంధీ ఆడిటోరియంలో ట్రాఫిక్​ ఏర్పాట్లు