ePaper
More
    HomeతెలంగాణMP Arvind | ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి : ఎంపీ అర్వింద్​

    MP Arvind | ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి : ఎంపీ అర్వింద్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​(MP Dharmapuri Arvind) డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ పెట్టారు. దుబ్బాక, హుజురాబాద్​ ఉప ఎన్నికల సమయంలో ఎంపీ అర్వింద్​తో పాటు, బీజేపీ నేత జితేందర్​రెడ్డి (Jitender Reddy) ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబోరేటరీ(FSL) రిపోర్ట్​ పేర్కొంది. అంతేగాకుండా వాళ్ల అనుచరులకు చెందిన 200 మంది ఫోన్లు కూడా ట్యాప్​ చేశారని ఎఫ్​ఎస్​ఎల్ తెలిపింది.

    ఎఫ్​ఎస్​ఎల్​ నివేదికపై (FSL report) స్పందిస్తూ ఎంపీ అర్వింద్​ కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్​ను (Bandi Sanjay) కోరారు. ఈ విషయమై తాను లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రికి కూడా లేఖ రాస్తానని వెల్లడించారు.

    MP Arvind | సీఎంపై సంచలన వ్యాఖ్యలు

    ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో (phone tapping case) రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం లేదని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కేసీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీంతో ఈ కేసులో నేరస్తులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ అన్నారు. అందుకే కేంద్ర సంస్థతో విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...