ePaper
More
    Homeక్రైంPhone Tapping Case | విచారణకు హాజరైన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు

    Phone Tapping Case | విచారణకు హాజరైన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఏ–6 శ్రవణ్​రావు మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన ఓ కంపెనీని రూ.6 కోట్ల మేర మోసం చేసినట్లు తెలిసింది. సరుకు సరఫరా చేయకపోయినా డబ్బులు తీసుకున్నట్లు శ్రవణ్ రావుపై సదరు కంపెనీ ఫిర్యాదు చేసింది. రూ.6 కోట్ల వరకు మోసం చేశారని కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు.

    తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్​రావు కీలకంగా వ్యవహరించినట్లు సిట్​ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ–6 ఉన్న ఆయనను ఇది వరకే సిట్​ విచారించింది. ఫోన్​ ట్యాపింగ్​ కేసు నమోదైన తర్వాత విదేశాలకు పారిపోయిన శ్రవణ్​రావు అక్కడే ఉండిపోయారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్​ రావడంతో మార్చిలో హైదరాబాద్​ వచ్చారు. ఈ క్రమంలో మార్చి 29న సిట్​ అధికారులు ఆయనను విచారించారు. తాజాగా రూ.6 కోట్ల మోసం కేసులో ఆయనను విచారించారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...