HomeతెలంగాణPhone Tapping Case | హైదరాబాద్​ చేరుకున్న ‘ఫోన్​ ట్యాపింగ్’​ నిందితుడు ప్రభాకర్​రావు

Phone Tapping Case | హైదరాబాద్​ చేరుకున్న ‘ఫోన్​ ట్యాపింగ్’​ నిందితుడు ప్రభాకర్​రావు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​ రావు (Prabhakar rao) ఎట్టకేలకు హైదరాబాద్​ (Hyderabad) వచ్చారు.

గత మార్చిలో ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case ) నమోదు కాగానే ప్రభాకర్​ రావు అమెరికా పారిపోయాడు. విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అరెస్ట్​ నుంచి సుప్రీం కోర్టు ఇటీవల ఊరట కల్పించడంతో ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్​ చేరుకున్నారు.

సోమవారం సిట్​ అధికారుల ఎదుట ప్రభాకర్​రావు విచారణకు హాజరు కానున్నారు. కాగా.. విచారణలో భాగంగా ఆయన చెప్పే విషయాలు కీలకంగా మారనున్నాయి. గత ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.

Must Read
Related News