అక్షరటుడే,ఇందల్వాయి: Indalwai | అనారోగ్యంతో ఓ పీజీ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నల్లవెల్లి (nalalvelli) గ్రామానికి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) రవి కుమార్తె సంజన (21) హైదరాబాద్లో పీజీ (PG student) అభ్యసిస్తోంది. వారం రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికాగా.. తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో (Private Hospital) చికిత్స చేయిస్తున్నారు.
అయితే మూడురోజులుగా కోమాలో ఉన్న సంజన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచిందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదువుతూ.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న అమ్మాయి అకాలమరణం చెందడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.