- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

Nizamabad CP | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Nizamabad CP | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. రెంజల్​ మండలంలోని కందకుర్తి వంతెనను (Kandakurti bridge) శుక్రవారం ఆయన పరిశీలించారు.

రానున్న రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోలెవెల్​ వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఎగువ ఉన్న మహారాష్ట్ర నుంచి భారీగా వరద (heavy floods) వస్తున్నందున కందకుర్తి వంతెనను ఆనుకుని వరద ప్రవహిస్తోందన్నారు. నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ నుంచి, విష్ణుపురి నుంచి సైతం భారీగా వరద వస్తున్నందున స్థానిక ప్రజలు అలర్ట్​గా ఉండాలని పేర్కొన్నారు.

- Advertisement -

అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్​ (Renjal police station)కు గాని.. డయల్ 100కు ఫోన్​ చేయాలని సూచించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్​స్పెక్టర్​ ఎస్ సంతోష్ రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్, తహశీల్దార్​ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News