అక్షరటుడే, బోధన్: Yedapally | పింఛన్ పెంచి ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈమేరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఎడపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ( Yedapally Panchayat office) శనివారం పింఛన్దారులు ముట్టడించారు.
ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ.. వికలాంగులకు రూ. 6వేలు, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత, బీడీ కార్మికులకు (beedi workers) రూ. 4వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కండరాల క్షీణత ఉన్నవారికి రూ.15వేలు ఇవ్వాలని కోరారు.
Yedapally | సీఎం మోసం చేస్తున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సుజాత సూర్యవంశి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. పింఛన్లు పెంచి ఇస్తారని లబ్ధిదారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు సావిత్రి, ఆఫీజ, బాలమణి, స్వర్ణలత, హైమదీ, సునీత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.