Homeజిల్లాలునిజామాబాద్​Scholarships | పెండింగ్​లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి

Scholarships | పెండింగ్​లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Scholarships | పెండింగ్​లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్​షిప్​ విడుదల చేయాలని ఏబీవీపీ (ABVP) జిల్లా కన్వీనర్ బాలకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో (NTR Couwrastha) ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు స్కాలర్​షిప్​, ఫీజు రియంబర్స్​మెంట్​ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీంతో పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. బకాయలు విడుదల కాకపోవడంతో విద్యార్థుల నుంచి కళాశాలలు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.

Scholarships | టీసీలు.. మెమోలు ఇవ్వట్లేదు..

స్కాలర్​షిప్​లు అందని కారణంగా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీలు (TC), మెమోలు (Memo) ఇవ్వట్లేదని నాయకులు ఆరోపించారు. దీంతో పైచదువులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ (Self Finance) కోర్సులో చదువుతున్న విద్యార్థుల వద్ద కొన్ని కార్పొరేట్ కళాశాలలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ కంఠేశ్వర్ జోనల్ ఇన్​ఛార్జి దుర్గాదాస్, మహేష్, ప్రణీత్, సిద్దు, ప్రేమ్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.