Homeజిల్లాలుకామారెడ్డిPD Act | అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ యాక్ట్

PD Act | అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ యాక్ట్

దోపిడీలకు పాల్పడుతున్న దొంగలపై పీడీయాక్ట్​ అమలు చేశారు. ఈ మేరకు కలెక్టర్​ జారీ చేసిన ఉత్తర్వులను పోలీసులు నిందితులకు అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: PD Act | అంతర్రాష్ట్ర పార్థీ దొంగల ముఠాపై పోలీసులు పీడీ యాక్ట్​ (PD Act) నమోదు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిందితులకు ఉత్తర్వుల కాపీని అందజేశారు.

ముఠా సభ్యులు కృష్ణ బాబు షిండే, నామ్‌దేవ్ అలియాస్​ రామ్‌కిషన్ భోస్లే అలియాస్​ రామ్‌దాస్, రాథోడ్ అజిత్ రమేశ్ అలియాస్​ అజయ్​పై పీడీ యాక్ట్ అమలు చేశారు. అదే ముఠాకు చెందిన మరో ప్రధాన నిందితుడు భాస్కర్ బాపూరావ్ చవాన్ అలియాస్​ భాస్కర్‌దాదా రావ్ చవాన్ సదాశివనగర్ (Sadashivnagar), గాంధారి, తాడ్వాయి, పిట్లం , బీర్కూర్, మద్నూర్ పోలీస్ స్టేషన్లతో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో (Nirmal district) మొత్తం 14 దోపిడీ, చోరీ కేసుల్లో నేరాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ప్రస్తుతం అతను నిజామాబాద్ సెంట్రల్ జైలులో (Nizamabad Central Jail) ఉన్నాడు. ఈ నేపథ్యంలో కామారెడ్డి కలెక్టర్ (Kamareddy Collector) జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజ్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు శనివారం నిజామాబాద్ సెంట్రల్ జైల్​లో నిందితులకు పీడీ యాక్ట్​ ఉత్తర్వులను అందజేశారు. నిందితుల నేరపూరిత చర్యలు సమాజంలో శాంతి-భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నందున, ప్రజల రక్షణ కోసం పీడీ యాక్ట్ ప్రయోగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

Must Read
Related News