అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Congress Nizamabad | పీసీసీ క్రమ శిక్షణ కమిటీ మెంబర్గా (PCC Disciplinary Committee) సీనియర్ నాయకుడు రామకృష్ణను (Ramakrishna) ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా నగరంలోని కాంగ్రెస్ భవన్లో బుధవారం రామకృష్ణను ఘనంగా సన్మానించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తనను గుర్తించి క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పార్టీ ఇచ్చిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకుడు నాగరాజు, హరిబాబు, రాజేంద్రప్రసాద్, బంటు బలరాం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.