ePaper
More
    HomeతెలంగాణPCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

    PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పొంగులేటి ఆదివారం మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ విడుదల అవుతుందని, మొదట ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందున కాంగ్రెస్​ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు.

    స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంతో మహేష్ గౌడ్(PCC Chief Mahesh Goud)​ సీరియస్​ అయినట్లు తెలిసింది. ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కేబినెట్​లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒకరి మంత్రిత్వ శాఖపై వేరొకరు మాట్లాడడం సరైంది కాదన్నారు. అందులోనూ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన సూచించినట్లు సమాచారం. పార్టీతో సంప్రదించకుండా ఏ ఒక్కరూ ప్రకటనలు చేయొద్దని ఆయన ఆదేశించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...