KCR
KCR | కేసీఆర్​ను ఫేస్​ టు ఫేస్​ విచారిస్తున్న పీసీ ఘోష్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: KCR | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమిషన్​ ఛైర్మన్​ పీసీఘోష్(PC Ghosh) కేసీఆర్​ను ఫేస్​ టూ ఫేస్​ విచారిస్తున్నారు. మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​ను కమిషన్​ బహరంగంగా విచారించింది. కేసీఆర్​ను కూడా బహిరంగ విచారణకు పిలిచింది. దీంతో కేసీఆర్​(KCR)తో పాటు తొమ్మిది మంది కమిషన్​ కార్యాలయంలోకి వెళ్లారు. అయితే అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కేసీఆర్​ కోరారు. కేసీఆర్​ కోరిక మేరకు కమిషన్​ వన్​ టూ వన్ విచారణ చేపట్టింది. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించారు.

KCR | బీఆర్​ఎస్​ కార్యకర్తల అరెస్ట్​

కేసీఆర్​ విచారణ సందర్భంగా బీఆర్కే భవన్(BRK Bhavan)​ వద్ద బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్(Police Arrest) చేశారు. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యక్తరల మధ్య తోపులాట చోటు చేసుకుంది.