ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Railway Passengers | ఆ మార్గంలో తొలిసారి కూతపెట్టనున్న ప్రయాణికుల రైలు.. ఎక్కడో తెలుసా..!

    Railway Passengers | ఆ మార్గంలో తొలిసారి కూతపెట్టనున్న ప్రయాణికుల రైలు.. ఎక్కడో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Railway Passengers | ఏళ్ల క్రితం నిర్మించిన ఆ రైల్వే మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు కూత పెట్టనుంది. తమ చెంతనే రైల్వే మార్గం ఉన్నా.. రైలు ఎక్కే భాగ్యం లేక ప్రజలు ఇన్ని రోజులు ఇబ్బందులు పడేవారు. తాజాగా రైల్వేశాఖ (Railway Department) ప్రయాణికుల రైలు నడపడానికి ఆమోదం తెలపడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతిలోని (Amaravati) నడికుడి నుంచి శ్రీకాళహస్తి (Srikalahasti) వరకు రైల్వేలైన్​ ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే ఈ మార్గంలో కేవలం గూడ్స్​ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్రయాణికుల రైళ్ల నడపాలని ఆయా గ్రామాల ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ వీక్లీ ఎక్స్​ప్రెస్​ (weekly express) నడపడానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

    READ ALSO  Nandyal | భర్తను చంపి డోర్​ డెలివరీ చేసిన భార్య.. నంద్యాలలో ఘటన

    Railway Passengers | ప్రతి శుక్రవారం

    శ్రీకాళహస్తి – నడికుడి రైల్వే మార్గంలో (Srikalahasti – Nadikudi railway line) ఈనెల 4న తొలి రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నెమలపురి, రోంపిచర్ల రైల్వే స్టేషన్లలో టికెట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం ఈ రైలు నడుస్తుందని వారు పేర్కొన్నారు. జులై 4 నుంచి 25 వరకు ప్రతి శుక్రవారం ఈ రైలు మహారాష్ట్రలోని నాందేడ్​ నుంచి బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తిరుపతిలో జులై 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరుతోంది. వినుకొండకు రాత్రి 10.05కు, రొంపిచర్ల 10.25కు, నెమలిపురి 10.35కు, పిడుగురాళ్ల 10.45కు, నడికుడి 11.00కు, నాందేడ్‌కు ఆదివారం ఉదయం 09.30 గంటలకు చేరుకుంటుంది.

    READ ALSO  Chittoor | ల్యాబ్​ టెక్నీషియన్​తో విద్యార్థి ప్రేమ.. ఇద్దరు కలిసి జంప్​.. తర్వాత ఏం జరిగిందంటే..

    Latest articles

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    Special Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు...

    Anganwadi centers | అంగ‌న్‌వాడీ.. అసౌకర్యాల బడి

    అక్ష‌ర‌టుడే, భీమ్‌గ‌ల్‌: Anganwadi centers | అంగన్​వాడీ కేంద్రాలు అసౌకర్యాలకు నెలవుగా మారాయి. సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువవడంతో...

    More like this

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    Special Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు...